వనపర్తి: ప్రియుడితో కలిసి భర్తను దారుణ హత్య

వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేశారు. అక్టోబరు 28న జరిగిన ఈ ఘటనలో, ఇద్దరూ కలిసి కుట్ర పన్ని కురుమూర్తిని చంపి, అనంతరం సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట కారులో శ్రీశైలం వెళ్లి డ్యాంలో మృతదేహాన్ని పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నాగమణి, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ కేసును వనపర్తి రెండో ఎస్సై శశిధర్ నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్