నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని డిండి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పొనుగోటి కృష్ణారావు (85) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన గ్రామానికి సర్పంచ్గా సేవలందించి, సమాజానికి ఎంతో సేవ చేశారు. ఆయన మరణవార్త స్థానికులను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు అంత్యక్రియలు శనివారం సాయంత్రం హైదరాబాద్లో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.