కార్తీక మాసం సందర్భంగా చండూరు మండలం వ్యాప్తంగా ఆలయాలు కార్తీక శోభతో వెలిగిపోయాయి. బుధవారం ఉదయం తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి, చండూరు శ్రీ మార్కండేశ్వర, శివాలయం, అంగడిపేట శివాలయం, లకినేనిగూడెం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాల్లో అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర పారాయణాలు జరిగాయి. మహిళలు సామూహికంగా తరలి వచ్చి దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.