ఆదివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో 10వ అంతర్ జిల్లా రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్-2025 పోటీలు ముగిశాయి. అండర్-14, అండర్-16, అండర్-19 విభాగాల్లో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అంబిటస్ స్కూల్, జేబీ ఇన్ఫ్రా గ్రూప్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి. సైక్లింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఒలంపిక్ సంఘం కార్యదర్శి పి. మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.