3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌

ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 3 నుంచి నిరవధిక బంద్ చేపట్టాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకు తరగతులు నిర్వహించబోమని, అప్పుల ఊబిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, లేనిపక్షంలో ధర్నా చేస్తామని హెచ్చరించాయి. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కళాశాలల వర్సిటీల అధిపతులకు బంద్ నోటీసులు అందజేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్