నల్గొండ జిల్లా పట్టణ అధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి మాట్లాడుతూ, భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఇందిరా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.