గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఐక్యతా విగ్రహం వద్ద నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. మరోవైపు అధికారులు హెలికాప్టర్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు.