ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ సభ్యుల కోసం ఒక కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై సభ్యులు తమ పాస్బుక్ లైట్ పేరుతో తమ బ్యాలెన్స్ వివరాలను EPFO మెంబర్ పోర్టల్లోనే నేరుగా చూసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ సదుపాయం ద్వారా సభ్యులు తమ PF ఖాతాలోని నిల్వల వివరాలను సులభంగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇది సభ్యులకు మరింత పారదర్శకతను, సౌలభ్యాన్ని అందిస్తుంది.