దిల్లీ తపాలా శాఖలో వచ్చే ఏడాది జనవరి నుంచి నెక్ట్స్ డే పార్సిల్, ఉత్తరాల డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించారు. ప్రస్తుతం పార్సిల్ డెలివరీకి 3 నుంచి 5 రోజులు పడుతుండగా, ఈ నూతన సేవలతో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.