వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. టోల్ ప్లాజాల్లోని అపరిశుభ్రమైన టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే, వారి ఫాస్టాగ్ అకౌంట్లోకి రూ.1,000 రివార్డ్ జమ చేయబడుతుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు 'రాజమార్గ్ యాత్ర' యాప్లో టైమ్ స్టాంప్తో పాటు అపరిశుభ్రమైన టాయిలెట్ల ఫోటోలను అప్లోడ్ చేయాలి. అర్హత కలిగిన వారికి ఈ రివార్డు లభిస్తుంది. NHAI నిర్వహించే టాయిలెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.