అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడక్పల్లిలో శనివారం భార్యాభర్తల గొడవలో భార్య బానోత్ సరోజ (46) కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త బానోత్ రాజు (48)ను పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ దంపతులు గత ఆరు నెలలుగా బీరంగూడలో నివసిస్తూ కూలీ పని చేసుకుంటున్నారు. గతంలో భర్త భార్యను వేధించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రభాకర్, సీ నరేశ్ వివరాలు సేకరించారు.