నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో గురువారం పోలీస్ శాఖ, మోటార్ వాహనాల శాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులు, ప్రైవేట్ టూరిస్ట్ బస్సులను తనిఖీ చేశారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్స్యూరెన్స్ వివరాలను అధికారులు పరిశీలించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేసి, డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు.