ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలోని ఈపీఎస్-95 పథకం కింద అందే పెన్షన్ మొత్తానికి సంబంధించిన కీలక గణాంకాలను కేంద్రం వెల్లడించింది. ఈ పథకం కింద దాదాపు 81 లక్షల మంది పెన్షన్దారులు లబ్ధి పొందుతుండగా.. అందులో కేవలం 0.65 శాతం మందికి మాత్రమే నెలకు రూ.6 వేలకు పైగా పెన్షన్ అందుతోందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్సభలో వెల్లడించారు.