అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ (31) హత్యకు గురయ్యాడు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో సంఘటనా స్థలంలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అయితే గందరగోళంలో నిందితుడు తప్పించుకున్నాడు. ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించి, అనుమానితుడి ఫొటోలు విడుదల చేసింది. హత్యకు ఉపయోగించిన రైఫిల్ను స్వాధీనం చేసుకుంది.