ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది నిద్రపోవడంతో పారిస్ నుంచి కోర్సికా ద్వీపానికి ప్రయాణికులతో వెళ్తున్న విమానం 18 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. కోర్సికా రాజధాని అజాక్సియోలో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. దాంతో ఆ దిశగా కిందికి దిగుతోంది. కానీ ఎయిర్పోర్ట్ కంట్రోల్ టవర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో పైలట్ విమానాన్ని గాల్లోనే ఉంచాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది నిద్రపోవడంతో ఈ ఘటన జరిగింది.