ప్రముఖ మరాఠీ నటి ప్రియా మరాఠే (37) ఆదివారం ఉదయం 4గంటలకు మృతి చెందారు. కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ప్రియా చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మరాఠీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ప్రియా 'పవిత్ర రిష్ట', 'సాత్ నిభానా సాథియాన్', 'తుఝేచ్ మే గీత్ గాత్ ఆహే' వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత ఏడాది కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.