పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’ ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. సినిమా రిలీజ్కు ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉండటంతో మూవీ టీమ్ ఇవాళ ట్రైలర్ను విడుదల చేయాలని భావించింది. కానీ కొన్ని గంటలు వాయిదా వేసినట్లు తెలిపింది. ఇదే రోజు సాయంత్రం ‘ఓజీ’ కాన్సర్ట్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. కాగా దసరా కానుకగా ఓజీ సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు.