AP: అమరావతిలో జరిగిన 'మెగా డీఎస్సీ ఉత్సవ్'లో ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో వెళ్లగా, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ డ్రైవింగ్ సీట్లో కూర్చొని సందడి చేశారు. జిల్లాల వారీగా నేతలకు ప్రత్యేక బస్సులు కేటాయించారు.