నవంబర్ 5న కరూర్‌కు రాహుల్‌గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నవంబర్ 5వ తేదీన కరూర్‌కు రానున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రకటించింది. గత నెల 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగింది. కాగా, అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన రాహుల్ గాంధీ, బాధితులను ఓదార్చేందుకు వస్తున్నారని టీఎన్‌సీసీ నేతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్