హైదరాబాద్ లో భూముల వేలంలో రికార్డ్ ధర లభించింది. TGIIC నిర్వహించిన భూ వేలంలో ఒక ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. HYDలోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయగా ఈ ధర లభించింది. వేలంలో పాల్గొన్న ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ రికార్డు ధరకు 7.67 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు గాను మొత్తం రూ.1,357.57 కోట్లు చెల్లించింది. గతంలో కోకాపేటలో ఒక ఎకరం రూ. 100 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే.