శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు శుక్రవారం రాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి వద్ద 3.6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతని కదలికలపై అనుమానం రావడంతో లగేజీని తనిఖీ చేయగా ఈ గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు రూ.3.6 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన గంజాయితో పాటు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.