రేపటి నుంచి (సోమవారం) అమలులోకి వచ్చే కొత్త జీఎస్టీ రేట్లపై వినియోగదారులకు తక్షణ ఫిర్యాదు కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ కస్టమర్ హెల్ప్లైన్ (NCH)లో ఇన్గ్రామ్ పోర్టల్లో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. వాహనాలు, బ్యాంకింగ్, FCMG, ఇ-కామర్స్ వంటి విభాగాల్లో వినియోగదారులు పన్ను తప్పులు, రేట్లలో మార్పులు, బిల్లింగ్ లోపాలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ సౌకర్యం సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుంది.