పెన్షన్కు అర్హులు కాని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థికసాయాన్ని 100% పెంచే ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా, పెనూరీ గ్రాంట్ను రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెంచింది. పెన్షన్కు అర్హత లేని సైనికోద్యోగుల వితంతువులైన మహిళలకు ఎలాంటి ఆదాయం లేని, 65 ఏళ్లు పైబడిన వారికి నెలవారీగా రూ.8 వేలు ఇవ్వనుంది. పిల్లల చదువు కోసం ఇచ్చే సహాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,000కు, అమ్మాయిల పెళ్లికి ఇచ్చే రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచింది.