RSS చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు మతాన్ని అడిగి 26 మంది టూరిస్టులను హతమార్చిన ఘటనపై ఆయన స్పందించారు. దేశం మొత్తం ఈ దాడితో రగిలిపోయిందని, మన బలగాలు ధైర్యంగా సమాధానమిచ్చాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్లో మన మిత్రదేశాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. ప్రభుత్వాలు సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందని, నేపాల్లో జెన్జీ ఉద్యమం ప్రభుత్వాలకు హెచ్చరిక అని భగవత్ పేర్కొన్నారు.