RSSపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అల్లర్లు, హింసకు RSS కారణమని ఆయన విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలను ప్రధాని మోదీ నిజంగా గౌరవిస్తే, వెంటనే ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించగా, కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు.