సంగారెడ్డి: 15వ తేదీన ప్రత్యేక లోక్ ఆదాలత్

ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి సౌజన్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్