ఆసియా కప్లో భాగంగా అబుదాబి వేదికగా శుక్రవారం ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ (56) హాఫ్ సెంచరీతో రాణించారు. అభిషేక్ శర్మ (38), తిలక్ వర్మ (29), అక్షర్ పటేల్ (26) ఫర్వాలేదనిపించారు. ఒమన్ బౌలర్లలో ఆమిర్ కలీం, షా ఫైజల్, జితెన్ రామనండి రెండు చొప్పున వికెట్లు తీశారు.