సెక్యూరిటీ గార్డుకు రూ. 3.14 కోట్ల జీఎస్టీ నోటీసులు

ఢిల్లీలో నెలకు రూ.10 వేలు సంపాదించే ఓ సెక్యూరిటీ గార్డుకు సెంట్రల్ జీఎస్టీ రూ.3.14 కోట్ల పన్ను నోటీసులు ఇచ్చింది. సెక్యూరిటీ గార్డు ఓమ్‌జీ శుక్లా పేరుపై రూ.17.47 కోట్ల టర్నోవర్‌తో వస్త్ర వ్యాపారం నడుస్తోందని నోటీసుల్లో ఉంది. ఏడు రోజుల్లో తమ ముందు హాజరవ్వాలని పేర్కొన్నారు. ఎవరో తన పాన్‌ కార్డ్‌ వినియోగించి కంపెనీలు రిజిస్టర్‌ చేశారని శుక్లా తెలిపారు. రూ.17 కోట్ల వ్యాపారం చేసి పన్ను చెల్లించలేదని వాపోయాడు.

సంబంధిత పోస్ట్