లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ మేనేజర్ స్వామి చైతన్యానంద సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఢిల్లీలోని వసంత్ కుంజ్లో ఎస్ఆర్ఐఎస్ఐఐఎంకు మేనేజర్గా స్వామి చైతన్యానంద పని చేస్తున్నారు. చైతన్యానంద తమను లైంగికంగా వేధిస్తున్నాడని పలువురు విద్యార్థినులు ఆరోపించారు. ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేయగా తాజాగా అదుపులోకి తీసుకున్నారు.