మధ్యప్రదేశ్ ఇండోర్లో 18 ఏళ్ల శ్రద్ధ తివారీ ప్రేమికుడు సార్ధక్తో పెళ్లి చేసుకోవడానికి ఆగస్టు 23న ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే రైల్వే స్టేషన్కి రాని సార్ధక్ చివరికి పెళ్లి చేసుకోనని తిరస్కరించాడు. నిరాశతో ఒంటరిగా కూర్చున్న శ్రద్ధను కాలేజీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న కరణ్దీప్ గమనించాడు. విషయం తెలుసుకుని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరికి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులు వారిని ఇంటికి తీసుకువచ్చారు.