గుండెపోటుతో మాజీ సర్పంచ్ కన్నుమూత

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని టీ. మాందాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రం అనసూయ (60) సోమవారం గుండెపోటుతో మరణించారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు మెదక్‌లోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె మృతి పట్ల గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్