భారీగా పెరిగిన వెండి.. బంగారం ధర ఎలా ఉందంటే?

వెండి ధరలు శనివారం భారీగా పెరిగి మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,000 పెరిగి రూ.1,43,000 వద్ద ధర కొనసాగుతోంది. 2 రోజుల్లో కేజీ వెండిపై రూ.3,000 పెరిగింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గి రూ.1,01,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.110 తగ్గి రూ.1,11,170 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్