వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు మంగళవారం వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఏపిఏఐ ఆధ్వర్యంలో రిటైర్డ్ మండల విద్యాధికారి సురేష్ కుమార్ విద్యార్థుల మానసిక వికాసం, లక్ష్య సాధనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.