రైతులకు టార్పాలిన్లు ఖచ్చితంగా అందజేయాలి

రాజన్న సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో రైతులు వరి కోతలు రెండు రోజులు వాయిదా వేసుకోవాలని, వర్షాలు తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలని సూచించారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కచ్చితంగా టార్పాలిన్లు అందజేయాలని, సన్నరకం వడ్లను కూడా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్ర ప్రకాశ్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్