ఆసియా కప్లో సూపర్-4 మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. అభిషేక్ శర్మ (74; 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లు) విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ బాదిన అభిషేక్.. టీ20ల్లో రెండుసార్లు తొలి బంతికే సిక్స్లు బాదిన తొలి భారత క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. అలాగే కేవలం 331 బంతుల్లోనే 50 సిక్స్లు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించాడు.