TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ఈ ఘటనపై డిసెంబర్ 15 లోపు నివేదిక సమర్పించాలని రవాణా, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం మీర్జాగూడ గేటు వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఈ దుర్ఘటనలో 19 మంది మరణించగా, 24 మంది గాయపడ్డారు.