అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల ప్రభావంతో మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉందనే అంచనాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగబాకి 81,107 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 24,859 వద్ద ట్రేడింగ్ని స్టార్ట్ చేశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 14 పైసలు పెరిగి 87.95 చేరింది.