ఏనుగుల తరలింపు కేసులో అనంత్ అంబానీ స్థాపించిన వంతారాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వంతారాలో చట్టాలను పాటించట్లేదని, విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాయి. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఏనుగులను తరలిస్తే.. అందులో ఏ తప్పూ లేదని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. సిట్ దర్యాప్తులో కూడా వంతారాకు క్లీన్చిట్ లభించింది.