ఆసియా కప్ గెలిచిన టీమిండియా ట్రోఫీ లేకుండానే స్వదేశం చేరింది. ఫైనల్లో దుమ్మురేపిన తిలక్ వర్మ హైదరాబాద్కు రాగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ముంబైలో దిగారు. విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఉగ్రదాడి బాధితులకు మ్యాచ్ ఫీజు విరాళం ప్రకటించిన సూర్యకు "భారత్ మాతాకీ జై" నినాదాలతో అభిమానులు కేరింతలు కొట్టారు.