ఆదివారం హుజూర్నగర్ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సంఘం బాధ్యులు వారణాసి కిషోర్, దేశ సేవలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యువత ఆర్ఎస్ఎస్ లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర్ కార్యవాహ సముద్రాల సంతోష్ కుమార్, సహా కార్యవాహ రాపోలు నాగ ప్రవీణ్, నగర శారీరక ప్రముఖ్ చిన్నపల్లి నరసింహ పాల్గొన్నారు.