కోదాడ నయా నగర్ జ్యోతి అపార్ట్మెంట్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, బీజేపీ సీనియర్ నాయకులు నూనె సులోచనలు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజ శ్రేయస్సు పెరుగుతుందని వారు అన్నారు. కమిటీ అధ్యక్షుడు గడ్డం గురువా రెడ్డి, డా. బ్రహ్మం, చందర్ రావు, నారాయణ, కృష్ణయ్య, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని వారు అభినందించారు.