మోత్కూర్: ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ కళాశాల బంద్

గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని శ్రీ సంతోష్ డిగ్రీ కళాశాలకు తాళం వేసి, కళాశాల యాజమాన్యం నిరవధిక బంధు ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్