ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో ట్రాన్స్జెండర్లు మానవత్వం చాటుకున్నారు. పంజాబ్లో వరదలతో తీవ్ర నష్టం చవిచూసిన బాధితులకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి, తమ ఆదాయంతో పాటు దాతల నుంచి విరాళాలు సేకరించారు. కష్టాల్లో ఉన్నవారికి తోడ్పాటు అందించడంలో లింగ భేదం అడ్డుకాదని మరోసారి నిరూపించారు.