మహిళ ప్రాణం తీసిన గుంత

రోడ్డుపై ఉన్న గుంత ఓ మహిళ ప్రాణాలు బలి తీసుకుంది. మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన అనిత తన భర్తతో కలిసి బైక్ పై నవ్జే అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇద్దరు స్వగ్రామానికి బైకుపై బయలు దేరారు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతను గమనించకపోవడంతో బైకు ఒక్కసారిగా అందులో నుంచి వెళ్లడంతో వెనుక కూర్చొన్న అనిత ఎగిరి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయలుకావడంతో మృతి చెందింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్