బంగారం ధర రోజురోజుకి పెరిగిపోతుంది. శుక్రవారం రూ.1.35 లక్షలు దాటేసింది. దీంతో ఈ పసిడి ధర మరింత పెరిగే అవకశాం ఉందని నిపుణులు చెప్తున్నారు. అమెరికా షట్డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి, యూఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలతో మదుపర్లు బంగారంలో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారట. దీంతో గోల్డ్ ఈటీఎఫ్లకు భారీగా డిమాండ్ ఉందట. అలాగే పండగలు, పెళ్లిళ్ల సీజన్ కూడా రావాడంతో బంగారం ధర రూ.1.50 లక్షలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.