TG: హైదరాబాద్ బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విల్లాస్లో గణేశ్ లడ్డూ రూ.2.32 కోట్ల భారీ ధర పలికిన విషయం తెలిసిందే. మొత్తం 80 విల్లాల ఓనర్స్ నాలుగు గ్రూపులుగా విడిపోయి 500కి పైగా బిడ్లతో వేలం పాటలో పాల్గొంటారు. వేలంలో వచ్చిన డబ్బుతో RV దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 NGOలకు ఆర్థికసాయం చేస్తారు. ఈ ట్రస్టు ద్వారా 10వేల మందికి సాయం అందుతోంది. 2018లో రూ.25 వేలతో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ.2.32 కోట్లకు చేరింది. ఈ లడ్డూను అన్ని కుటుంబాలు పంచుకుంటాయి.