ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి కోటి రూపాయలు కాజేసిన దుండగులు (VIDEO)

TG: హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌ మెట్‌ పరిధిలోని బ్రిలియంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో భారీ దొంగతనం జరిగింది. కాలేజీ నుంచి దుండగులు రూ.కోటికి పైగా నగదును ఎత్తుకెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కళాశాల పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి, నిందితుల కోసం చర్యలు చేపట్టారు. కాగా ఈ కళాశాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందినదిగా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్