AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్ధరాత్రి 12 గంటల నుంచే భక్తులు బారులు తీరడంతో ఆలయం పరిసరాలు జనసందోహంగా మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేశారు.