భక్తులను ఢీకొట్టిన రైలు.. ఏడుగురు మృతి (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. చునార్ రైల్వే స్టేషన్‌లో భక్తులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ప్లాట్‌ఫామ్ కాకుండా ట్రాక్‌పై భక్తులు దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిలో స్నానం చేయడానికి వచ్చినట్లు తెలిసింది. నిన్న చత్తీస్‌గఢ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు.

సంబంధిత పోస్ట్