నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం హింసకు దారి తీసింది. ఇవాళ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసులు రబ్బర్ బెల్లెట్లు ప్రయోగించడంతో 16 మంది మృతి చెందారు. 40మందికి పైగా ఆందోళనకారులు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో యువకులు పిట్టల్లా రాలిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.